లాక్డౌన్ ఎఫెక్ట్: తాత్కాలిక జైలుగా మొహాలీ స్టేడియం..
కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ ఉల్లంఘించిన వారికోసం మొహాలీ 11వ ఫేజ్లో
కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ ఉల్లంఘించిన వారికోసం మొహాలీ 11వ ఫేజ్లో ఉన్న అంతర్జాతీయ హకీ స్టేడియంను తాత్కాలిక జైలుగా అధికారులు మార్చేశారు. లాక్డౌన్ నిబంధన అమలులో ఉన్నంతకాలం ఈ స్టేడియంను జైలుగా ఉపయోగిస్తామని డిప్యూటీ కమిషనర్ గిరీశ్ దీన్దయాల్ తెలిపారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని ప్రతీ మూలలోనూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పిన ఆయన.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి కర్ఫ్యూని ఉల్లంఘించాలని ప్రయత్నించే వారిపై ఓ కన్నేసి ఉంచామని తెలిపారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 289 కర్ఫ్యూ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, 391 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక.. 410 వాహనాలను సీజ్ చేశారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపై తిరగాలని ప్రయత్నించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎఫ్ఆర్ నమోదు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశామని సీనియర్ ఎస్పీ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.