జగన్‌ను మోదీ ఎందుకు కల్వలేదంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్‌మెంట్ కన్‌ఫర్మ్ అయ్యాకనే ఢిల్లీ వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చివరికి ప్రధానిని కల్వకుండానే తిరుగుముఖం పట్టారు. ఢిల్లీ పర్యటనను చివరి నిమిషం దాకా మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి.. తీరా ఢిల్లీ వెళ్ళి 24 గంటలు తిరక్కుండానే తిరిగొచ్చేశారు. ఇంతకీ మోదీని జగన్ ఎందుకు కల్వలేదు. ప్రాబ్లెం అటా? ఇటా? ఎటువైపు నుంచి? ఇదిప్పుడు ఏపీలో హాట్ చర్చకు తెరలేపింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు ప్రధాన అంశాలకు ప్రధాని […]

జగన్‌ను మోదీ ఎందుకు కల్వలేదంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 3:54 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అపాయింట్‌మెంట్ కన్‌ఫర్మ్ అయ్యాకనే ఢిల్లీ వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చివరికి ప్రధానిని కల్వకుండానే తిరుగుముఖం పట్టారు. ఢిల్లీ పర్యటనను చివరి నిమిషం దాకా మీడియాకు తెలియకుండా జాగ్రత్తపడిన ముఖ్యమంత్రి.. తీరా ఢిల్లీ వెళ్ళి 24 గంటలు తిరక్కుండానే తిరిగొచ్చేశారు. ఇంతకీ మోదీని జగన్ ఎందుకు కల్వలేదు. ప్రాబ్లెం అటా? ఇటా? ఎటువైపు నుంచి? ఇదిప్పుడు ఏపీలో హాట్ చర్చకు తెరలేపింది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు ప్రధాన అంశాలకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటనకు పూనుకున్నారు. డిసెంబర్ చివరి వారంలో నిర్వహించ తలపెట్టిన కడప ఉక్కు కర్మాగారానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకోసం డిసెంబర్ 24-26 తేదీల మధ్య ప్రధాని అపాయింట్‌మెంట్ కోరేందుకు అభ్యర్థనా పత్రంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. దానికి తోడు జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని కూడా ప్రధాని చేతుల మీదుగా లాంచ్ చేయాలని సీఎం తలపెట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జనవరి 9న ముహూర్తం ఖరారు చేసుకున్న ముఖ్యమంత్రి.. ఆ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించ తలపెట్టారు.

ఈ క్రమంలో ఈ రెండింటికి ప్రధాన మంత్రి సహకారాన్ని కోరడం ద్వారా ఆయన్ని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీకి గురువారం రాత్రి చేరుకున్నారు. కానీ తెల్లారేసరికి సీన్ మారిపోయింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ ఆకస్మిక మరణంతో జగన్ ప్రధానిని కల్వకుండానే తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కడపకు విమానంలో చేరుకుని నారాయణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు.

అయితే, ప్రధానిని జగన్ ఎందుకు కల్వలేదని మరోవైపు చర్చ మొదలైంది. మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కొందరు చెబుతుండగా.. దానికి ఏపీ బిజెపి నేతలు బ్రేక్ వేశారని కూడా ప్రచారం మొదలైంది. కానీ, ఉల్లిధరలు, జిడిపి వంటి కీలకాంశాలపై బిజెపి థింక్ ట్యాంక్ భేటీ అత్యవసరంగా సమావేశం అవుతున్న నేపథ్యంలో మోదీ మరోసారి కలుద్దామన్న సంకేతాలను జగన్‌కు పంపించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ తిరుగుపయనమయ్యారని చెబుతున్నారు. సో.. త్వరలోనే జగన్ మరోసారి ఢిల్లీ వెళ్ళే ఛాన్స్ వుందని సీఎంవో వర్గాలంటున్నాయి.

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి