‘తేజస్వి యాదవ్ ముందు నితీష్ తలవంచడం ఖాయం’, చిరాగ్ పాశ్వాన్

| Edited By: Anil kumar poka

Nov 05, 2020 | 1:56 PM

నవంబరు 10 న బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నితీష్ కుమార్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందు తలవంచడం ఖాయమని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు.

తేజస్వి యాదవ్ ముందు నితీష్ తలవంచడం ఖాయం, చిరాగ్ పాశ్వాన్
Follow us on

నవంబరు 10 న బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నితీష్ కుమార్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందు తలవంచడం ఖాయమని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. అధికారం కోసం నితీష్ కుమార్ అంగలారుస్తున్నారని, సీఎంగా మళ్ళీ కొనసాగాలని తపన పడుతున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు ఇదే ప్రధాన మంత్రితో  మీరు వాదించి..వాదించి..లేదా విమర్శించి..అలసిపోయారు. ఇప్పుడు ఓట్లకోసం అర్థించగానే ఆయనతో వేదికలెక్కి ఆయన ముందు మోకరిల్లుతున్నారు.. ముఖ్యమంత్రి పదవికోసం ఎంతగా ఆరాట పడుతున్నారో అందుకు ఇదే నిదర్శనం అని చిరాగ్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ని ఆయన బలహీనుడైన ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. శనివారం బీహార్ మూడో (తుది) దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ ఇలా మళ్ళీ సీఎం పై విరుచుకపడ్డారు.