Budget 2021 Agriculture: రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం, అగ్రి ప్రొక్యూర్ మెంట్ పెంచుతాం , నిర్మల.

| Edited By: Ram Naramaneni

Feb 01, 2021 | 12:56 PM

Budget 2021 Agriculture in Telugu: కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు..

Budget 2021 Agriculture: రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం, అగ్రి ప్రొక్యూర్ మెంట్ పెంచుతాం , నిర్మల.
Follow us on

Budget 2021 Agriculture: కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీరికి సంబంధించి కనీస మద్దతు ధర పెంపు కొనసాగుతుందని, అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ను . 16.5 లక్షల కోట్లకు పెంచాలన్న ప్రతిపాదన ఉందని ఆమె చెప్పారు. 2020-21 లో వరిధాన్య రైతులకు మొత్తం 1.72 లక్షల కోట్లను చెల్లించామని, అలాగే గోధుమ పంట పండించే వారికీ 75 వేల కోట్లను కేటాయించగా సుమారు 43 లక్షలమంది అన్నదాతలు ప్రయోజనం పొందారని ఆమె తెలిపారు. ఇంకా ఆమె పేర్కొన్న ప్రధాన అంశాల్లో కొన్ని ఇలా ఉన్నాయి.

డిజిటల్ పేమెంట్స్ ప్రమోషన్ కోసం రూ. 1500 కోట్లు

రాబోయే సెన్సస్ ఇక డిజిటల్ విధానంలోనే

ఇందుకు 3,768 కోట్ల కేటాయింపు

చిన్న కంపెనీల నిర్వచనాన్ని రివైజ్ చేస్తాం

ఈ సంస్థల కేపిటల్ బేస్ ని ప్రస్తుతమున్న 50 లక్షల నుంచి 2 కోట్లకు పెంచాలని నిర్ణయం

తమిళనాడు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు

రానున్న 5 ఏళ్లలో స్వచ్ఛ భారత్ 2.0 ని 1,41,678 కోట్లతో అమలు చేస్తాం

రైల్వేలకు రూ. 1,10,055 కోట్లు

ఆర్ధిక లోటు జీడీపీలో  9.5 శాతం ఉంటుందని అంచనా

Also Read:

Budget in Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్