Andhra Pradesh: సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

|

Jun 20, 2022 | 8:44 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లాలో(Prakasam District) తీవ్ర విషాదం నెలకొంది. పుల్లల చెరువు మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు కవలకుంట్ల చెరువుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగి....

Andhra Pradesh: సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
Prakasam District
Follow us on

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లాలో(Prakasam District) తీవ్ర విషాదం నెలకొంది. పుల్లల చెరువు మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు కవలకుంట్ల చెరువుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగి ఈత కొడుతున్న సమయంలో లోతును అంచనా వేయలేక నీట మునిగారు. ఒకరి వెంట మరొకరు ఇలా నలుగురూ నీటిలో మునిగి పోయారు. బయటకు వచ్చే దారి లేక, ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం అయినప్పటికీ చిన్నారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లల కోసం వెతుకుతూ కవలకుంట్ల చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులూ మృతి చెందారు. సాయిరెడ్డి, విష్ణురెడ్డి, బ్రహ్మారెడ్డి, మణికంఠలు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల మృతితో ఆయా కుటుంబాల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి