కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి

తాజాగా టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీ నారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు..

కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 1:38 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కోవిడ్ బారిన పడి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. ఇక అందులోనూ కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వలన గత 5 నెలలుగా షూటింగ్స్ అన్నీ స్తంభించాయి. దీంతో సినీ కార్మికులు పొట్టకూటి కోసం పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే కరోనాతో ఇండస్ట్రీలకు చెందిన కొందరు సినీ ప్రముఖులు కన్నుమూస్తుండటం ఆందోళనకు గురి చేస్తుంది.

తాజాగా టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీ నారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలుగులో శ్రీ భాగ్యలక్షి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘ఎదురీత’ అనే చిత్రాన్ని నిర్మించారు బోగారి లక్ష్మీ నారాయణ.

Also Read:

బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి

షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?

వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?

కేజీఎఫ్‌-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!