మన దేశ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దాని మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించినప్పుడు సాగు సక్రమంగా జరుగుతుంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజలందరికీ తిండి దొరకాలంటే వ్యవసాయం బాగుండడం చాలా అవసరం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వివిధ పథకాల ద్వారా రైతులను ఆదుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది పీఎం కిసాన్ పథకం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనేది దేశంలోని రైతుల ప్రయోజనం కోసం కేంద్రం రూపొందించిన పథకం. వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించడం, రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడం దీని లక్ష్యం. ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి అర్హత కలిగిన రైతులకు రూ. 2వేలు చొప్పున అందజేస్తారు. అంటే ఏడాదికి రూ.6 వేలను అన్నదాతలకు అందిస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ , డిసెంబర్-మార్చిలో మూడు వాయిదాలుగా డబ్బులు విడుదల అవుతాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 16వ విడత నిధులను 2024 ఫిబ్రవరి 28న కేంద్ర విడుదల చేసింది. దేశంలోని దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ.21 వేల కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ప్రస్తుతం ఏప్రిల్ – జూలై లో విడుదల చేసే 17వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీపై కచ్చితమైన సమాచారం లేదు. మే నెలలో విడుదల కావచ్చని భావిస్తున్నారు.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేరు ఉందో, లేదో రైతులు పరిశీలించుకోవచ్చు. ఈ కింద పద్దతులతో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..