బస్సు నడుపుతూ ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్

విధి నిర్వహణ లో ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బస్సు నడుపుతూ ఉండగానే గుండె నొప్పి వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోయినా ప్రయాణికులకు ఏమీ కాకూడదనుకున్నాడు...వెంటనే బస్సును రోడ్డు పక్కగా ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు.

బస్సు నడుపుతూ ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్
Follow us

|

Updated on: Sep 04, 2020 | 6:01 PM

విధి నిర్వహణ లో ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. బస్సు నడుపుతూ ఉండగానే గుండె నొప్పి వచ్చింది. దీంతో తన ప్రాణాలు పోయినా ప్రయాణికులకు ఏమీ కాకూడదనుకున్నాడు…వెంటనే బస్సును రోడ్డు పక్కగా ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు.

ఒంగోలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దాసరి హనుమంతరావు గుండెపోటుతో మృతి చెందారు. పొదిలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఒంగోలుకు చేరుకోగానే అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో హనుమంతరావు బస్సును రోడ్డు పక్కకు ఆపివేశాడు. ఇది గమనించిన ప్రయాణికులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులున్నారు. తన వల్ల ప్రయాణికులకు అపాయం కలగకూడదని డ్రైవర్ తాపత్రయ పడిన తీరు ప్రయాణికుల హృదయాలను కలచివేసింది.