Greek ship: ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.

|

Jun 22, 2024 | 6:38 PM

లైబీరియా జెండాతో ఉన్న గ్రీస్‌ నౌక తాజాగా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది . గత వారం హౌతీ రెబల్స్‌ ఈ వాణిజ్య నౌకపై దాడి చేసారు. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం తెలిపింది. హౌతీ రెబల్స్‌ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది.

లైబీరియా జెండాతో ఉన్న గ్రీస్‌ నౌక తాజాగా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది . గత వారం హౌతీ రెబల్స్‌ ఈ వాణిజ్య నౌకపై దాడి చేసారు. ట్యూటర్‌ అనే ఈ నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో శిథిలాలతోపాటు చమురు ఆనవాళ్లు కనిపించాయని, దీనినిబట్టి నౌక మునిగి ఉంటుందని భావిస్తున్నామని బ్రిటీష్‌ మిలిటరీ విభాగం బుధవారం తెలిపింది.

హౌతీ రెబల్స్‌ దాడి కారణంగా సముద్రంలో నౌక మునగడం ఇది రెండోసారి. గతంలోనూ ఒకటి ఇలాగే మునిగిపోయింది. ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, హౌతీల దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాణిజ్య, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే తొలిసారి. ట్యూటర్‌ నౌకపై వారం కిందట బాంబులను నింపుకొని వచ్చిన హౌతీలకు చెందిన డ్రోన్‌ బోట్‌ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని ఒక ఉద్యోగి మరణించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on