Lord Rama: తుంగభద్రా తీరాన కొలువైన కోదండరాముడు.! 60 అడుగుల ఏకశిలా విగ్రహం.

|

Jan 26, 2024 | 5:12 PM

సరయు నది తీరంలో అయోధ్యలో బాల రాముడు భక్తుల పూజలు అందుకుంటూ ఉండగా.. తుంగభద్రా నది తీరంలో కోదండరాముడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పవిత్ర మంత్రాలయంలో కోదండం ధరించి అభయ ముద్రలో 68 అడుగుల రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల్లో శ్రీ రాముని శోభ యాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణంతో మంత్రాలయం మారు మోగింది.

సరయు నది తీరంలో అయోధ్యలో బాల రాముడు భక్తుల పూజలు అందుకుంటూ ఉండగా.. తుంగభద్రా నది తీరంలో కోదండరాముడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పవిత్ర మంత్రాలయంలో కోదండం ధరించి అభయ ముద్రలో 68 అడుగుల రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల్లో శ్రీ రాముని శోభ యాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణంతో మంత్రాలయం మారు మోగింది. మహిళలు వివిధ రకాల పిండి వంటలతో శ్రీరామునికి నైవేద్యాలు సమర్పించారు. తుంగభద్ర నదితీరంలో వెలసిన గ్రామ దేవత మాంచాలమ్మ ఒడిలో కూర్చుని శ్రీ రాఘవేంద్రస్వామి ఒక్కడే పూజలు అందుకుంటున్న సమయంలో శ్రీరాముడు కూడా అమ్మ ఒడికి చేరాడు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పుడు భక్తులంతా గురదేవునితోపాటు, శ్రీరామచంద్రుని కూడా దర్శించుకుంటున్నారు.

మంత్రాలయంలో 10 కోట్ల రూపాయలతో ఎర్పాటు చేసిన 60 అడుగుల శ్రీ రాముని ఏకశిల విగ్రహానికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపాల్గొన్నారు. శ్రీరాముని పల్లకిలో ఊరేగిస్తూ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ కలశాలు ధరించి శ్రీరాముని వెంట సాగారు. ఈ యాత్ర తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భారిగా భక్తులు తరలివచ్చారు. మంత్రాలయం జై శ్రీరామ్ నామస్మరణంతో మారు మోగింది. కుల మతాలకు అతీతంగా శ్రీ రాముని శోభ యాత్రలో ముస్లిం సోదరులు పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించడం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 10% పనులు పూర్తయినట్లు శ్రీ మఠం పీఠాధిపతులు తెలిపారు. ఇంకా 90% పనులు పూర్తి కావాల్సిందిగా ఉందని తెలిపారు. మంత్రాలయాన్ని నంబర్ వన్ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని శ్రీ మఠం పీఠాధిపతులు తెలియజేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us on