బండి సంజయ్ కుమార్

బండి సంజయ్ కుమార్
కరీంనగర్ బీజేపీబీజేపీ

బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడిగా ఉన్నారు. బండి సంజయ్ 2024 ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. 2020-2023 మధ్యకాలంలో మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడిగానూ ఆయన సేవలందించారు. రాజకీయ అరంగేట్రానికి ముందు బండి సంజయ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), ఏబీవీపీలోనూ పనిచేశారు.
బండి సంజయ్ కుమార్ 2005లో కరీంనగర్ 48వ డివిజన్‌కు మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో