AP News: ఉగాది షాపింగ్‌కి వెళ్లి ఇంటికి వస్తుండగా ఊహించని సీన్.. కట్ చేస్తే.. దిమ్మతిరిగింది.!

|

Apr 08, 2024 | 7:20 PM

నంద్యాలలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే స్థానిక తేజ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిలోకి చొరబడి అరవై తులాల బంగారం అపహరించుకెళ్లారు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తేజ అపార్ట్‌మెంట్‌లో సురేష్ అనే వ్యక్తి 304 ఫ్లాట్‌లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు.

నంద్యాలలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే స్థానిక తేజ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిలోకి చొరబడి అరవై తులాల బంగారం అపహరించుకెళ్లారు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని తేజ అపార్ట్‌మెంట్‌లో సురేష్ అనే వ్యక్తి 304 ఫ్లాట్‌లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు ఉగాది పండగ షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్లారు. ఇక సుమారు రెండు గంటల తర్వాత తిరిగి రాగా.. ఇంటి తాళాలు పగలుగోట్టిన స్థితిలో కనిపించాయి. ఈ క్రమంలోనే లోపలికి వెళ్లి చూడగా.. సామాన్లు చిందరవందరగా పడి ఉండటమే కాకుండా.. బీరువాలో పెట్టిన అరవై తులాల బంగారు నగలు కూడా అపహరించినట్టు గుర్తించాడు సదరు బాధితుడు. వెంటనే సమాచారం పోలీసులకు అందివ్వడంతో క్లూస్ టీం సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కాగా, బాధితుడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on