ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ లోక్సభ స్థానాల్లో తిరుపతి ఒకటి. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో ఒకటైన తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ సీటు తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా నడిచేది. అయితే దశాబ్ధాలుగా సాగుతున్న కాంగ్రెస్ ఆధిపత్యానికి వైఎస్సార్ సీపీ చెక్ పెట్టింది. గత రెండు లోక్సభ ఎన్నికలు 2014, 2019లో ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీయే విజయం సాధించింది.
తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర దేవాలయంతో పాటు ఇతర చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇది చెన్నై నుండి 150 కి.మీ, బెంగళూరు నుండి 250 కి.మీ.ల దూరంలో ఉంది. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన లేదా లక్ష్మి, పతి అంటే నివాసం లేదా భర్త. ఆచార్య-హృదయంలో తిరుపతి (తిరుమల)ని పుష్ప-మండపం అని పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి జనాభా 21,31,623గా ఉంది. ఇందులో 67.8 శాతం గ్రామీణులు, 32.2 శాతం పట్టణ ప్రజలు.
తిరుపతి ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)పై ఆధారపడి ఉంటుంది. TTD అనేది తిరుమల వేంకటేశ్వర ఆలయంతో పాటు తిరుపతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేవాలయాలను నిర్వహించే ఒక స్వతంత్ర ట్రస్ట్. తిరుపతి ప్రధాన మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రం. దేశ నలుమూలల నుంచి తిరుపతికి రైలు, బస్సులు, విమాన సదుపాయం ఉంది.
తిరుపతి సీటు ఎవరు, ఎప్పుడు గెలుస్తారు?
తిరుపతి లోక్సభ స్థానానికి దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా 1952లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీని తర్వాత కూడా 1962, 1967, 1971, 1977, 1980లో కాంగ్రెస్ గెలిచింది. తొలిసారిగా 1984లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గెలిచింది. అయితే కాంగ్రెస్ తిరిగి పుంజుకుని 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో విజయం సాధించింది. 1999లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. 2004, 2009లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 2014, 2019 ఎన్నికలు, 2021 ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.