ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ బుధవారంనాటి నుంచి అమలులోకి రావడంతో మందుబాబులకు మంచిరోజులు వచ్చినట్లయ్యింది. కొత్త మందు షాపులు ఓపన్ కాగా.. కొత్త యజమానులు, మందుబాబులకు నచ్చిన కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ వ్యాపారులకు మద్యం షాపులు లాటరీ విధానంలో ఏపీ ప్రభుత్వం కేటాయించడం తెలిసిందే. కొత్త బ్రాండ్లతో మద్యం షాపులు అందుబాటులోకి రావడం పట్ల మందుబాబులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.