నెల్లూరు జిల్లాలోని తడ సమీపంలో వాయుగుండం తీరందాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పాటు సముద్ర తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో అంతర్వేది తీర ప్రాంతంలో 500 మీటర్లు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.