ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య ఆస్తుల పంపిణీ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల మీడియా సమావేశాన్ని నిర్వహించి.. జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పవర్ కట్ కావడంతో వైఎస్ షర్మిల కాస్త అసంతృప్తికి గురైయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.