నల్గొండ జిల్లాలోని ఓ వైన్ షాపులో దసరా నాడు అర్థరాత్రి వైన్ షాప్లో చోరీ జరిగింది. వైన్ షాపు పైకప్పు రేగులను పగులగొట్టి దొంగ లోపలికి ప్రవేశించాడు. రూ.12 లక్షలను దోచుకెళ్లాడు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. వైన్ షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదిత్య వైన్స్లో చోరీ ఘటన జరిగింది.