జైలు నుంచి తప్పించుకోవడానికి కొందరు ఖైదీలు వేసిన భారీ స్కెచ్.. పోలీసులకే దిమ్మతిరిగింది. దసరా సందర్భంగా తోటి ఖైదీలతో కలిసి రాయామణం నాటకం వేయాలని ఖైదీలంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు కూడా తెలిపారు. దీంతో వారు కూడా ఓకే చెప్పి ఖైదీలను ప్రోత్సహించారు. అయితే రామాయణ నాటకంలో భాగంగా వానర వేషం వేసిన కొందరు ఖైదీలు.. పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జైల్లో జరిగింది.