తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ లోకో పైలట్ హత్యకేసు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ కేసుకు సంబంధించి కీలక విషయాలు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో కీలక విషయాలు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించగా.. ఒంటిపై చొక్కా లేకుండా సంచరించినట్లు గుర్తించారు. గుడివాడ రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడ్ని పట్టుకున్నారు. బిహార్ వాసిగా గుర్తించి.. కీలక విషయాలు రాబట్టారు. డబ్బు కోసమే లోకో పైలట్ను హత్యచేసినట్టు నిర్ధారించారు.