జగన్ - షర్మిల ఆస్తుల వివాదంలో జనసేన పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి మధ్య ఆస్తుల వివాదంలో వైఎస్ సతీమణి విజయమ్మే జడ్జిగా పేర్కొన్నారు. వెంటనే ఆమె బయటకు వచ్చి ఆస్తుల వివాదాన్ని పరిష్కరించాలని సూచించారు. జగన్ జైలుకు వెళ్లాలని తల్లి కోరుకుంటుందా అని ప్రశ్నించారు.