రాత్రి సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని బెదిరించి డబ్బులు కాజేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ వాగు వద్ద చోటుచేసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు బాధితుల నుంచి రూ. 500 నగదు, రూ. 800 ఫోన్ పే ద్వారా వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని తెలిపారు.