ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి వాహన సేవలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. శుక్రవారం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు వకుళామాత నూతన వంటశాలను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.