బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు సమర్థించుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించడం రాజ్యాంగ విరుద్దం, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.