దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై ఆపిన లారీల్లో డీజిల్ను పూర్తిగా మాయంచేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. తాజాగా మూడు లారీల్లోని డీజిల్ను దొంగలు రాత్రికిరాత్రి మాయం చేశారు. దీంతో వాహనదారులు లబోదిబో మంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.