ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎక్కారు. విజయవాడ నుంచి తెనాలి వరకు టికెట్ తీసుకుని గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వరకు ప్రయాణించారు. ఏపీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ఎప్పటి నుంచి కల్పిస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.