ఐఏఎస్ అధికారిణి అమ్రాపాలి ఏపీలో విధులు నిర్వహించనున్నారు. అమ్రపాలీ సహా మరో ఆరుగురు ఐఏఎస్లు తమ సొంత క్యాడర్ మేరకు ఏపీ, తెలంగాణలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశాలివ్వడం తెలిసిందే. తెలంగాణలోనే కొనసాగేందుకు అమ్రపాలి చేసిన ప్రయత్నం ఫలించలేదు. హైకోర్టులోనూ ఊరట దక్కకపోవడంతో అమ్రపాలి అమరావతికి వెళ్లారు. ఏపీ ప్రభుత్వంలో ఆమె విధులు నిర్వహించనున్నారు.