ప్రస్తుతం రాజకీయ నేతలు విమర్శించుకుంటున్న తీరు.. రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజార్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నేతలకు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు బండారు దత్తాత్రేయ ప్రతియేటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అభినందించారు. ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడుకున్నా.. మిగిలిన సమయంలో రాజకీయ నేతలు పరస్పర గౌరవంతో మెలగాలని సూచించారు.