మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వంశీ, శ్వేతలకు ఇటీవల వివాహం జరిగింది. ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహమయ్యాక వచ్చే తొలి దసరా, ఉగాది పండగలను చేదు పండుగలుగా భావిస్తారు. అందుకే కొత్త అల్లుడిని అత్తింటివారు తమ ఇంటికి తీసుకరారు. అయితే మహబూబాబాద్ జిలా బయ్యారంలో ఉంటున్న శ్వేత పిన్ని, బాబాయి గరిపెల్లి లావణ్య- వేణు కుటుంబం కొత్త దంపతులను దసరాకు ఆహ్వానించారు.