భారత పారిశ్రామిక మేరు శిఖరం రతన్ టాటా ఇక ఈ లోకంలో లేదన్న చేదు నిజం అందరినీ కలచివేస్తోంది. భారతదేశానికి తమదైన సేవ చేసిన ఆ మహా వ్యక్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఆవేదన కూడా అదే. తాను చిరుధాన్యాలతో తయారుచేసిన కళా రూపాన్ని రతన్ టాటాకు అంకితమిద్దామని సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఇలా ఈ లోకాన్ని రథం టాటా వీడి వెళ్లడంతో ఆ చిత్రకారుడు నివాళులర్పించాడు.