ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి ఎయిరిండియా విమానం బయల్దేరింది. బయల్దేరిన కాసేపటికి విమానంలో బాంబు ఉందనే బెదిరింపు కాల్ వచ్చింది. ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ నుంచి ఆదేశాలు రాగానే ఆ విమానాన్ని హుటాహుటిన దారిమళ్లించి, ఢిల్లీలో ల్యాండింగ్ చేయించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోగానే- ప్రయాణికులను, విమాన సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు.