హిందూపురంలో అమ్మకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే ఎమ్మెల్యే వారిని ఎందుకు ప్రశ్నించలేదని వైసీపీ నాయకురాలు శ్యామల ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే హాయిగా నిద్రపోవచ్చని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే ఇప్పుడు మహిళలు బిక్కుబిక్కుమని గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు.