ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్కను వాగు కష్టాలు వెంటాడాయి. ఆమె కాన్వాయ్ ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేకపోయింది. దీంతో గమ్య స్థానానికి చేరుకునేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని విడిచిపెట్టి.. రక్షణలేని అటవీశాఖ జీపును ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.