సినీ నటి మంచు లక్ష్మి మంచి మనసును చాటుకున్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకున్నారు. సోమవారంనాడు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ను సినీ నటి మంచు లక్ష్మి కలిశారు. జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న సందర్భంగా కలెక్టర్ బీఎం సంతోష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంచు లక్ష్మి టీచ్ ఫర్ ఛేంజ్ వ్యవస్థపాకురాలుగానూ ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో మంచు లక్ష్మి దత్తత కార్యక్రమాలు చేపడుతున్నారు.