గగనతలపు కాన్వాస్పై డ్రోన్లు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో కృష్ణా నది గట్టున అదరహో అనే రేంజ్లో జరిగింది. కృష్ణా తీరంలో...పున్నమి ఘాట్లో...పున్నమి వెలుగులను మించి డ్రోన్ హ్యాకథాన్ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు, వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్లను ఆవిష్కరించాయి.