ఇటీవల అస్వస్థతకు గురైన వంగవీటి రాధను ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వంగవీటి రాధకు ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వంగవీటి రాధా ఇంటికి వెళ్లి లోకేష్ ఆయన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.