ప్రజా సమస్యల పరిష్కారంలో తనకున్న చిత్తశుద్ధిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి చాటుకున్నారు. కాన్వాయ్ ని ఆపి మరీ వాహనం కిందకు దిగివచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. విజయనగరం జిల్లాలో డయేరియా బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినతిపత్రంతో రోడ్డు పక్కన ఓ దివ్యాంగురాలు నిల్చొని ఉండటాన్ని గమనించిన పవన్.. కాన్వాయ్ ఆపించారు. ఆమె నుంచి వినతిపత్రం స్వీకరించి.. సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.