తెలంగాణలో దీపావళి ముందే బాంబులు పేలతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు మరో మంత్రి సీతక్క. కచ్చితంగా దీపావళికి ముందే టపాసులు పేలుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే ఈడీ విచారణలో పలు విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడ్డవారు జైలుకు పోవాల్సిందే అన్నారు మంత్రి సీతక్క.