దసరా సందర్శంగా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి శనివారంనాడు స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. ఆ గ్రామంలో 21 కోట్ల 39 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పథకాలను ప్రారంభించారు. పలు అభివృద్ది పనులకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. తన మనుమడితో కలిసి జమ్మి చెట్టుకు పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.