నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారంనాడు నిర్వహించిన అలయ్ -బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నిర్వాహకులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి 19ఏళ్ల క్రితం బండారు దత్తాత్రేయ అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.