మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల టైమ్ తరహాలో నిత్యం పర్యటిస్తున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే.. మహిళా ప్యాసింజర్లతో ఉచిత ప్రయాణ సదుపాయం గురించి ఆరా తీశారు. తాము సీట్లలో కూర్చుంటే.. టికెట్ కొనే వారికి సీట్లు దొరకడం లేదని ఓ మహిళ అనడంతో కోమటిరెడ్డి నవ్వు ఆపుకోలేకపోయారు.