మల్కాజిగిరిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్ చేసింది. దృష్టి మరల్చి మొబైల్ ఫోన్లు చోరీ చేసిన ఘటనలు కలకలం రేపాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు కావడంతో అసలు విషయం బయడపడింది. ఆనంద్ బాగ్లో ఓ వ్యక్తి వద్ద నుంచి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్లో నుంచి దుండగులు ఫోన్ కొట్టేసి.. అక్కడి నుంచి తిన్నగా జారుకున్నాడు.