ఈ బ్లూ టీ తాగితే.. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయ్..!

Jyothi Gadda

29 June 2025

ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందుతారు.

బ్లూ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగిపోతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం తగ్గుతుంది.

శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఈజీగా బరువు తగ్గుతారు. 

రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి.

గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు, భోజనం చేసిన తర్వాత శరీర కణాల ద్వారా చక్కెరలను అధికంగా శోషించడాన్ని నిరోధిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌కి మంచిది.

శంఖు పుష్పాల టీలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, కొవ్వును  తగ్గిస్తాయి. 

శంఖు పుష్పాలటీ మెదడు ఆరోగ్యానికి, ఆందోళన, నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు. ఈ టీ తాగితే మెదడు రిఫ్రెష్ ‌అవుతుంది. సానుకూల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది.