పసుపు కాలేయంలో పైత్యరసం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల పొట్టలో ఆమ్లతత్వం, జఠరాగ్ని పెరుగుతాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు కలిగిస్తుంది.
పసుపు ఎక్కువైతే,కడుపు ఉబ్బరం, తలనొప్పి, తల తిరగడం, అజీర్ణం, మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఛాతిలో మంట, పొట్టలో కురుపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
పసుపులో ఆగ్జలేట్లు ఉంటాయి. పసుపును ఎక్కువగా వినియోగించినపుడు ఈ ఆగ్జలేట్లు శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలుగా మారతాయి.
పసుపులో ఉండే కొన్ని రకాల మినరల్స్ కూడా రాళ్లలా మారతాయి. ఇవన్నీ మూత్రపిండాల్లోకి చేరి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
పసుపుకి యాంటీ కోయాగ్యులెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీనివల్ల రక్తం తొందరగా గడ్డకట్టదు. శరీరానికి ఏదైనా సర్జరీ జరిగినపుడు..
ప్రమాదవశాత్తూ శరీరానికి ఏదైనా గాయాలైనపుడు రక్తస్రావం ఆగక పలు సమస్యలు ఏర్పడతాయి. ఆయుర్వేద ఔషధమైన పసుపును మితంగా వాడటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పసుపులో కర్కుమిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరానికి ఐరన్ ధాతువును అందకుండా చేస్తుంది. పసుపు అధిక వినియోగం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
పసుపుని మోతాదుకి మించి వాడినపుడు శరీరంలో రక్తపోటు స్థాయి ఉండాల్సిన దానికన్నా తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. అధిక ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదతోపాటు ముఖంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. డెర్మటైటిస్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు.
శరీరంలో కర్కుమిన్ స్థాయి ఎక్కువైనపుడు తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. ఎప్పుడూ మైకం కమ్మినట్లు ఉంటుంది. అందుకే రోజుకి 500 నుంచి 2,000 మిల్లీగ్రాముల మోతాదుకి మించి పసుపు తీసుకోకూడదు.