ఉగాది పంచాంగం : అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏవో తెలుసా?

samatha 

30 march 2025

Credit: Instagram

మార్చి30న ఉగాదిపండుగ,నేడు  ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు. ముఖ్యంగా తమ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలననుకుంటారు.

విశ్వవాసు నామ సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత మే 15న గురు గ్రహం వృషభ రాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించబోతుంది.

దీంతో ఈ గురు సంచారంతో సంవత్సరం మొత్తం ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందంటున్నారు పండితులు. ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి : ఈ సంవత్సరంలో గురు గ్రహం రెండోసారి వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వలన ఈ రాశి వారికి అఖండ రాజయోగం, ధనలాభం కలుగుతుందంట.కుటుంబలో ఆనందం నెలకొంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు సంచారంతో అదృష్టం కలిసిరానున్నది. అందువలన వీరు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా,వృత్తిపరంగా కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : సప్తమ స్థానంలో గురు సంచారం వలన ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

తుల రాశి : ఈ సంవత్సరంలో గురు  భాగ్యస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పులు తీరిపోయి, ధన లాభం కలుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది

సింహ రాశి : గురు గ్రహం 11వ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి అనేక లాభాలు కలుగుతాయి. అష్టమ శని నడుస్తున్నా వీరికి ఆర్థికంగా, వృత్తిపరంగా కలిసి వస్తుందంట.