చాణక్య నీతి : పిల్లలకు తప్పనిసరిగా ఈ విషయాలు నేర్పించాల్సిందేనంట!
samatha
30 march 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా మానవ వాళికి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది.
భార్య భర్తల మధ్య బంధం, బంధుత్వాలు, విజయం, అపజయం, స్త్రీ లో ఉండాల్సిన గుణాలు, విద్య, వైద్యం, నీతి, నియమాలు ఇలా చాలా విషయాలను ఆయన తెలిపారు.
ఇలానే తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా తప్పకుండా కొన్ని విషయాలను నేర్పాలని ఆయన తెలిపారు. అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తప్పకుండా పిల్లలకు నేర్పించాలంట. కోపంలో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కాబట్టి, కోపం అదుపులో ఉంచుకోవడం గురించి తెలపాలంట.
సంపద కంటే జ్ఞానం ముఖ్యమని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే జ్ఞానమే ముఖ్యం అని వారికి అర్థం అయ్యే విధంగా తెలియజేయాలి.
అబద్ధాలు ఆడటం వలన అప్పటికప్పుడు సంతోషం పొందవచ్చు. కానీ నిజం చెప్పి నిజాయితీగా ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గౌరవం ఇస్తారు.
పిల్లలకు తప్పకుండా పెద్ద వారిని గౌరవించడం నేర్పించాలంట. ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించడం వలన వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.
ఇంటి రహస్యాలను పిల్లలు ఇతరులకు చెప్పకూడదు. ఇంట్లోని విషయాలను భద్రంగా ఉంచాలని, ఇతరులతో షేర్ చేసుకోకూడదని పిల్లలకు తెలియజేయాలి.