ఉగాది పండుగ వచ్చేస్తుంది. మార్చి 30తో కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. దీంతో ఈ రోజు అందరూ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఇక ఈ ఉగాది రోజూ కొత్త బట్టలు ధరించి, ఆలయాలకు వెళ్లడం, ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం, అలాగే కుటుంబంతో కలిసి పంచాంగ శ్రవణం వింటుంటారు.
ఈరోజున పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిదని చెబుతారు. అతే కాకుండా ఈరోజు మొత్తం చాలా ఆనందంగా ఉండాలంటారు.
అంతేకాకుండా ఉగాది పండుగ రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదు అంటారు. అదే విధంగా తప్పకుండా కొన్ని పనులు కూడా చేయాలంట. ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది రోజున తప్పకుండా బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయడం చాలా మంచిదంటున్నారు పండితులు.
అదే విధంగా ఉగాది రోజు తప్పకుండా కొత్త బట్టలు కట్టుకొని మంగళప్రదంగా తయారవ్వాలంట. ఇది కుటుంబానికి, మీకు చాలా మంచిదంటున్నారు పండితులు.
అలాగే ఉగాది రోజున తప్పకుండా కాషాయం జెండాను ఇంటికి కట్టాలంట. దీని వలన ఇంటికి మంచి జరుగుతుంది. సమస్యలు తొలిగిపోతాయంట. ఆరోగ్యం బాగుంటుంది.
అలాగే ఉగాది రోజున తప్పకుండా ఉగాది పచ్చడి తాగాలి. ముఖ్యంగా ఈరోజు వేపాకు నీరు తాగడం తప్పనిసరి అని చెబుతున్నారు పండితులు.