06 December 2025

పచ్చి రొయ్యలు Vs ఎండు రొయ్యలు.. రక్తపోటు ఉన్నవారికి ఏవి మంచివంటే?

samatha

Pic credit - Instagram

రొయ్యలను ఇష్టపడని వారు ఎవరుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా రొయ్యలు తింటుంటారు.

అయితే కొంత మంది ఇష్టంగా పచ్చి రొయ్యలు తింటే మరికొంత మందికి ఎండు రొయ్యలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

కాగా, ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు, ఈ రెండింటి లో ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసుకుందాం.

పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు రెండూ ఆరోగ్యానికి మంచివే, ఇక పచ్చి రొయ్యల్లో ప్రోటీన్, విటమిన్ బీ12,సెలీనియం పుష్కలంగా ఉంటుంది.

అందువలన వీటిని తినడం వలన గుండె ఆరోగ్యం బాగుండటమే కాకుండా, మెందడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారు పచ్చి రొయ్యలు తినడం చాలా మంచిదని ఇవి, మంచి రుచితో పాటు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఎండు రొయ్యలతో పోల్చితే పచ్చి రొయ్యల్లో ఉప్పు తక్కువగా ఉంటుంది. రక్తపోటు ఉన్నవారికి పచ్చి రొయ్యలు బెస్ట్ ఆప్షన్.