వేసవి వేడినంతా పోగొట్టే అద్బుత ఫలం.. ఉదయాన్నే కొన్ని ముక్కలు తింటే చాలు!

Jyothi Gadda

10 May 2025

ఈ పండుకి మన శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమ్మర్ లో ఉదమయే రోజూ బొప్పాయి తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ పండుకి మన శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమ్మర్ లో ఉదమయే రోజూ బొప్పాయి తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

బొప్పాయిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. వేడి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కి దారి తీస్తుంది. 

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా రోజూ ఉదయమే బొప్పాయి ముక్కలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వేసవిలో ఇది చాలా అవసరం. శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చల్లబరుస్తుంది.

విటమిన్స్ ఎక్కువగా ఉండే పండు బొప్పాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, కే ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచేవే. సీజన్ మారుతున్నప్పుడు శరీరంలోనూ మార్పులు వస్తుంటాయి. 

బొప్పాయిలో నీటి శాతం ఎక్కువ. బొప్పాయిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయమే పరిగడుపున తింటే రోజంతా బాడీ డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది.

బొప్పాయిలో బీటా క్యారొటీన్, ఫ్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇవి శరీరం ఆక్సీకరణ చెందకుండా అరికడతాయి. ఇందులో పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. 

రోజూ ఉదయమే బొప్పాయి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు తీరిపోతాయి. వేసవిలో ఎక్కువగా వచ్చే ఈ సమస్యలకు బొప్పాయి మందులా పని చేస్తుంది.