మామిడి పండ్లు ఎక్కువగా  పండే దేశం ఏదో తెలుసా?

samatha 

22 MAY 2025

Credit: Instagram

మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడి పండ్లను తింటుంటారు.

అయితే ఈ మామిడి పండ్లు ఎక్కువగా ఏ దేశంలో పండుతాయో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

భారత దేశం ప్రపంచంలోనే మామిడి పండ్లను ఎక్కవగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని మామిడి పండ్లలో సగం ఇక్కడే పండుతున్నాయి.దాదాపు 25 మిలియన్ టన్నులు పండిస్తుంది.

భారత దేశం చాలా దేశాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది. దీని తర్వాత ఇండోనేషియా, చైనా, మెక్సీకో మామిడి పండ్లను ఎగుమతి చేస్తున్నాయి.

మామిడి పండ్లను పండించడంలో చైనా రండోవ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 3.8 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను పండిస్తున్నట్లు సమాచారం.

మామిడి పండ్లను పండించడంలో ఇండోనేషియా మూడవ స్థానంలో ఉంది. ఇది దాదాపు3.6 మిటియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లనుపండిస్తుంది. ఇక్కడి భూమి మామిడి సాకుకు అనువైనది.

పాకిస్థాన్ మామిడి పండ్ల సాగులో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 2.7మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను పండిస్తారు.

మెక్సికో ఏటా 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను పండిస్తూ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక్కడ అటాల్పొ, టామీ అట్కిన్స్ వంటి రకాల మామిడి పండ్లు దొరుకుతాయి.