చాణక్య నీతి : మీ ఇంట్లో అప్పులు పెరగడానికి కారణాలు ఇవే!

Samatha

12 November 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. తత్వవేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈయన తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి,  దాని ద్వారా ఆయన ఈ తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా డబ్బు, సంపాదన గురించి కూడా చాలా గొప్పగా తెలియజేశాడు.

కాగా, ఇప్పుడు మనం  అసలు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎవరిపై ఎక్కువగా ఉండదు. ఎలాంటి వారి ఇంట్లో అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి దగ్గర ధనం నిలవదో తెలిపారు, వారు ఎవరంటే?

ఆచార్య చాణక్యుడి ప్రకారం, అవసరం లేకపోయినా డబ్బును ఖర్చు చేసే వారి ఇంటి లోపల లక్ష్మీదేవి ఉండదంట. వారి ఇంట అప్పుల సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు చాణక్యుడు.

దొంగతనం, జూదం లేదా మోసం వంటి  అక్రమ  మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదంట. అది కూడా ఏదో ఒక రోజు వినాశనానికి కారణం అవుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.

ఏదైనా విషయం లేదా తమ వద్ద ధనం ఉందని గర్వపడటం కూడా మంచిది కాదంట. వారి వద్ద ఉన్న ధనం త్వరగా పోయి, వారు అప్పుల సమస్యల్లో చిక్కుకపోతారంట.

ఏ ఇంట్లో అయితే అశాంతి , కలహాలు, అవమానం ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు, ముఖ్యంగా ఇంటిలో స్త్రీ గౌరవించకపోతే అక్కడ దారిద్ర్యం తాండవం చేస్తుందంట.

ఏ ఇంట్లో అయితే అశాంతి , కలహాలు, అవమానం ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు, ముఖ్యంగా ఇంటిలో స్త్రీ గౌరవించకపోతే అక్కడ దారిద్ర్యం తాండవం చేస్తుందంట.